ప్రణాళికాబద్ధంగా కొండాపూర్ డివిజన్ అభివృద్ధికి కృషి

  • కార్పొటర్ హమీద్ పటేల్

కొండాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులను చేప‌డుతున్నామ‌ని కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. సోమవారం కొండాపూర్ డివిజన్ లోని పాన్ మక్తా, న్యూ పీజేఆర్ నగర్ లో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్ల పనులను స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలసి పరిశీలించారు. డివిజన్ లోని పలు సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి ఒక ప్రణాళిక రూపొందించి దాని ప్రకారం పనులను చేబడుతున్నామని అన్నారు.

సీసీ రోడ్డు ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చిన వెంటనే అంతర్గత రోడ్లను వేయిస్తున్నామని అన్నారు. సమగ్రంగా డివిజన్ లోని సమస్యలను పరిష్కరించి, ప్రజలు కోరుకొనే విధంగా మౌలిక వసతుల‌ కల్పనకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని, ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏరియా కమిటీ మెంబర్ కరీం, మహేష్ యాదవ్, న్యూ పీజేఆర్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ భిక్షపతి, కాలనీ మెంబర్స్ కృష్ణ, రామదార్, రంగారావు, శైలు, యూత్ నాయకులు వీరేష్, నర్సింగ్, బాలాజీ, ముకేష్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here