ఫ్రెండ్స్ కాలనీలో పర్యటించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చ‌ందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని ఫ్రెండ్స్ కాలనీలో కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి సోమ‌వారం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కాల‌నీవాసుల‌తో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఫ్రెండ్స్ కాలనీలో సుమారుగా రూ.1.20 కోట్ల నిధుల‌తో సీసీ రోడ్లు, యూజీడీ, తాగునీటి పైప్‌లైన్‌, పార్క్ అభివృద్ధి, ఓపెన్ జిమ్ త‌దిత‌ర ప‌నుల‌ను చేప‌ట్టామ‌ని తెలిపారు. ఇంకా ఏ సమస్య ఉన్నా తాము పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో భాగంగా గ్రాడ్యుయేట్స్ అందరూ ఓట‌ర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ వెంకటేశం, నవీన్, వరలక్ష్మీ, ఫ‌సియుద్దీన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఫ్రెండ్స్ కాలనీ అసోసియేష‌న్ స‌భ్యుల‌తో స‌మావేశ‌మైన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here