శేరిలింగంపల్లి, మార్చి 26 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ కె.లలితా దేవిని గురువారం టిఆర్పిఎస్ వైద్య సంఘాల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా. వెంకట్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె శేరిలింగంపల్లిలోని హఫీజ్పేట, కొండాపూర్, మాదాపూర్, మియాపూర్, నానక్రాంగూడ, గోపన్పల్లి, గచ్చిబౌలితోపాటు మణికొండలో ఉన్న ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.






