ఆరంబ్ టౌన్ షిప్ లో ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆరంభ టౌన్షిప్ లో ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటా జాతీయ పతాకం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరంభ టౌన్షిప్ లో కాలనీ వాసులు పెద్ద ఎత్తున జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి దాదాపుగా 250 జాతీయ జెండాలను పంపిణీ చేసి భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర రాథోడ్, నరసింహులు యాదవ్, డాక్టర్ సురేష్ నాయిక్, మహిపాల్ యాదవ్, నరేంద్ర కుమార్, నయీముద్దీన్, విక్రమ్ యాదవ్, జనార్ధన్, రాంభూపాల్ రెడ్డి, సాయిరాం, బాల్ రాజ్, యోగేష్, నల్లం రమేష్, అరుణ శ్రీ, రెహనా బేగం, మమతా రెడ్డి, పద్మ, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఆరంబ్ టౌన్ షిప్ లో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహిస్తున్న అసోసియేషన్ సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here