రిక్షా పుల్లర్స్ కాలనీలో వ‌ర‌ద స‌హాయం పంపిణీ

వివేకానంద‌న‌గ‌ర్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రిక్షా పుల్లర్స్ కాలనీలో వరదల వల్ల దెబ్బ తిన్న పేద కుటుంబాలకి 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కార్పొరేటర్ లక్ష్మీబాయి, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శుక్ర‌వారం పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వ‌ర‌ద బాధితుల‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం వారికి మ‌రిన్ని స‌హాయ స‌హకారాలు అంద‌జేస్తుంద‌ని తెలిపారు.

వ‌ర‌ద బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ లక్ష్మీబాయి
వ‌ర‌ద బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ లక్ష్మీబాయి

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ తెరాస అధ్యక్షుడు సంజీవ రెడ్డి, తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయినేని చంద్రకాంత్ రావు, రామారావు, బాబు రావు, రాధా బాయి, మోజేష్, సాలయ్య, గిరి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here