వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రిక్షా పుల్లర్స్ కాలనీలో వరదల వల్ల దెబ్బ తిన్న పేద కుటుంబాలకి 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కార్పొరేటర్ లక్ష్మీబాయి, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి మరిన్ని సహాయ సహకారాలు అందజేస్తుందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ తెరాస అధ్యక్షుడు సంజీవ రెడ్డి, తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయినేని చంద్రకాంత్ రావు, రామారావు, బాబు రావు, రాధా బాయి, మోజేష్, సాలయ్య, గిరి పాల్గొన్నారు.