శేరిలింగంపల్లి, జనవరి 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి గౌడ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దొంతి లక్ష్మీనారాయణ గౌడ్కు ధాత్రి ఇన్ఫ్రా అధినేత నిమ్మల ధాత్రినాథ్ గౌడ్ రూ.5 లక్షల విరాళం అందజేశారు. నందిగామలో ఉన్న గౌడ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్లో గదులను నిర్మించేందుకు గాను తన తండ్రి నిమ్మల మనోహర్ గౌడ్ జ్ఞాపకార్థం ధాత్రినాథ్ గౌడ్ ఈ విరాళం అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
