ధర్మపురి క్షేత్రంలో వైభవంగా సామూహిక అక్షరాభ్యాసం – చదువుల తల్లికి చిన్నారుల ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ ధర్మపురి క్షేత్రంలో అమ్మవారు ఆరవ రోజున సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. చదువుల తల్లి సరస్వతీకి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

సరస్వతి దేవి రూపంలో ని అమ్మవారికి పూజలు ఆచరిస్తున్న భక్తులు

ఈ సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. పరిసర ప్రాంతాల తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. వారి చిన్నారులచే సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆ తల్లి సమక్షంలో వేదపండితులు చిన్నారులచే ఓంకారాన్ని రాయించారు. తమ పిల్లలకు విద్యాబుద్ధులు, మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని తల్లిదండ్రులు అమ్మవారిని వేడుకున్నారు.

సామూహిక అక్షరాభ్యాసంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న స్థానిక చిన్నారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here