నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ గ్రామంలో శ్రీ దేవి శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని రెండవరోజు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావుతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో పండగలకు ప్రధాన్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మోహన్ ముదిరాజ్, కిరణ్ యాదవ్, మహేందర్ ముదిరాజ్, వినయ్ ముదిరాజ్, మాధవరం గోపాల్ రావు, అనిల్ కావూరి, వాసు, తాండ్ర రాంచందర్ గౌడ్, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






