గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): తెరాస ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. బుధవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి, కేశవనగర్, బసవతారకనగర్, జర్నలిస్ట్ కాలనీల్లో డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబాతో కలిసి ఆయన ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


ఈ సందర్బంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కేవలం తెరాసతోనే హైదరాబాద్ అభివృద్ది సాధ్యమని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలను తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, గ్రేటర్ను ఎంతగానో అభివృద్ధి చేశామని తెలిపారు. అన్ని డివిజన్లలోనూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. తెరాస అభ్యర్థులను గెలిపిస్తే రెట్టింపు స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. డిసెంబర్ 1న జరిగే పోలింగ్ లో కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగయ్య యాదవ్, రాజు నాయక్, రాజు ముదిరాజ్, గణేష్ ముదిరాజ్, నరేష్, చెన్నం రాజు, వినోద్ కుమార్ పాల్గొన్నారు.


నేతాజీనగర్ లో భేరి రామచందర్ యాదవ్ ఇంటింటికీ ప్రచారం..
గచ్చిబౌలి డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబాకు మద్దతుగా నేతాజీనగర్ లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి సాయిబాబాను గెలిపించాలని కోరారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో సాయిబాబా కాలనీలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని, అందువల్ల ఆయనకు ఓటు వేయాల్సిన బాధ్యత కాలనీవాసులపై ఉందన్నారు. సాయిబాబాను మళ్లీ కార్పొరేటర్గా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోరాంబాబు, గిరి, బాబు, ఆశ బేగం, మౌలానా, అశోక్ రెడ్డి, నాగరాజు, రమేష్ గుప్తా, రమ్య గుప్తా, బాలరాజ్ ముదిరాజ్, కుమార్ ముదిరాజ్, విద్యావతి, నాగలక్ష్మి, పంతం శీను, శంకర్ నాయక్, గంగమ్మ, కృష్ణ, చింటూ పాల్గొన్నారు.