శేరిలింగంపల్లి, జూన్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని శ్రీరామ్ నగర్ బీ – బ్లాక్ లో నెలకొన్న డ్రైనేజీ, పలు సమస్యలను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానిక నాయకులు, వాటర్ వర్క్స్ మేనేజర్ సందీప్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం కార్పొరేటర్ సమస్యను శాశ్వత పరిష్కార దిశగా కృషి చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, ప్రెసిడెంట్ జగన్ మోహన్ రెడ్డి, రవి కిరణ్, రంజిత్, వెంకటేశ్వర్ రావు, పురం విష్ణువర్ధన్ రెడ్డి, గోపాల్ యాదవ్, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.