ప్రేమ్ నగర్ A బ్లాకులో కార్పొరేటర్ హమీద్ పటేల్ ప‌ర్య‌ట‌న

కొండాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఎ బ్లాకులో నూతన విద్యుత్ స్తంభాలను, విద్యుత్ లైన్ల పనులను కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆదివారం పరిశీలించారు. శేరిలింగంపల్లి సర్కిల్ జోనల్ కమిషనర్ రవి కిరణ్, గచ్చిబౌలి సర్కిల్ ఎలక్ట్రికల్ డీఈ నరసింహారెడ్డిని కలసి డివిజన్ లో నూతన విద్యుత్ స్తంభాలు, కేబుల్ లైన్లు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేయగా మంజూరు చేయ‌డం జరిగిందని కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలియజేశారు.

ప్రేమ్ నగర్ ఎ బ్లాకులో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్న‌ కార్పొరేటర్ హమీద్ పటేల్

కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఎ బ్లాకులో డంపింగ్ పరిసరాలలో మంజూరు అయిన నూతన విద్యుత్ స్థంభాలు, విద్యుత్ కేబుల్ లైన్లు పనులను చేపట్టగా, పనుల తీరును పరిశీలించ‌డం జరిగిందన్నారు. నూతన విద్యుత్ స్థంభాలను, నూతన 3 ఫేజ్ కేబుల్ లైన్లను పొడిగిస్తూ చర్యలు తీసుకోవటం పట్ల జోనల్ కమిషనర్ రవి కిరణ్, విద్యుత్ అధికారులు, గచ్చిబౌలి సర్కిల్ ఎలక్ట్రికల్ డీఈ నరసింహారెడ్డి, ఏఈ ఖాద్రీలకు కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అభినందనలు తెలియజేశారు.

విద్యుత్ స్తంభం ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్

కొండాపూర్ డివిజన్ లో ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తూ ప్రజలకు మేలైన సేవలను అందించటానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలియజేశారు. ప్రేమ్ నగర్ ఎ బ్లాకు డంపింగ్ లో విద్యుత్ సమస్యలు ఉన్నాయ‌ని ప్ర‌జ‌లు తమ దృష్టికి తీసుకురావటంతోనే సంబంధిత అధికారులకు సమాచారమిచ్చి సమస్యలను పరిష్కరించటం జరిగిందని తెలిపారు.

కార్పొరేటర్ హమీద్ పటేల్ వెంట‌ ఎలక్ట్రికల్ ఏఈ ఖాద్రీ, వైస్ ప్రెసిడెంట్ గపూర్, వార్డు మెంబర్ శ్రీనివాస్ చౌదరి, ఏరియా కమిటీ మెంబర్ ఇమామ్, షేక్ అహ్మద్, అస్లాం, కిషన్, మహ్మద్ జహంగీర్, అజామ్ అలీ, లక్ష్మి నారాయణ, కాలనీ వాసులు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here