శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ కార్పొరేటర్ శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా

నమస్తే శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ ‌ఎన్నికల్లో శేరిలింగంపల్లి ‌106 డివిజన్ కార్పొరేటర్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటిచేసి ఓడిపోయిన యం.శివకుమార్ ఆ పార్టీకి రాజీనామ చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓటమి పాలై కాంగ్రెస్ ‌పార్టీలో కొనసాగుతున్న ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా‌ చేస్తూన్నట్టు తెలిపారు. నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ రఘునందన్ రెడ్డికి సోమవారం తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తక్కువ సమయంలోనే పార్టీ తనకు సముచిత స్థానం కల్పించిందని అన్నారు. ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ శేరిలింగంపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసేందుకు అవకాశం‌ కల్పించినందుకు పార్టీ అధిష్టానానికి శివకుమార్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఐతే ప్రస్థుతానికి ఏ పార్టీలో చేరడం లేనని, త్వరలో భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తానని తెలిపారు.

తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ‌ఇంచార్జీ రఘునందన్ రెడ్డికి అందజేస్తున్న శివకుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here