దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా నియోజకవర్గం సమన్వయకర్తగా సాయికుమార్

నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా శేరిలింగంపల్లి నియోజకవర్గం సమన్వయకర్తగా మెట్టు సాయికుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితలను మరోసారి మోసం చేస్తున్నారని, కేసీఆర్ మాయమాటలను నమ్మి ఎవరూ మోసపోకుండా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఏడేండ్ల పాలనలో గుర్తుకురాని దళితులు హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ‌‌ గుర్తుకురావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వ మోసపూరిత మాటలను తిప్పికొట్టి ప్రజల పక్షాన నిలబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రఘునాథ రెడ్డి, మహిపాల్ యాదవ్, ఇలియస్, భరత్ గౌడ్, కృష్ణ, సురేఖ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మెట్టు సాయికుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here