విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి – ప్రజ్ఞ డిగ్రీ కళాశాలల వార్షికోత్సవంలో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించినప్పుడే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ప్రజ్ఞ డిగ్రీ కళాశాల చైర్మన్, కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చందానగర్ లోని ప్రజ్ఞ డిగ్రీ కళాశాలల వార్షికోత్సవాన్ని ఎస్ ఎన్ రెడ్డి గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ప్రజ్ఞ డిగ్రీ కళాశాల వార్షికోత్సవంలో విద్యార్థులతో కలిసి పాల్గొన్న చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. అన్ని రంగాల్లో రాణించినప్పుడే భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలైనా ధైర్యంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాల్స్ విజయలక్ష్మీ, సుమలత, మధుసూదన రావు, నరేష్, లెక్చరర్లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

కళాశాల వార్షికోత్సవంలో సాంస్కృతిక ప్రదర్శనలిచ్చిన విద్యార్థులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here