శేరిలింగంపల్లి, జూన్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన పోరాడి, నేడు ప్రజలకు ప్రజాపాలన అందిస్తున్న నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నేడు ప్రజలకు ఆరోగ్యకరమైన జీవితం దూరం అయిందని అన్నారు . జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ప్రజలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించాలని, పార్కులు అభివృద్ధి చేయాలని, ప్రణాళిక లేకుండా గత ప్రభుత్వం ప్రజలకు ఉపయోగం లేని చెట్లను నాటడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై మేయర్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి ద్వారా అధికారులను ప్రశ్నించారు.