శేరిలింగంపల్లి, జనవరి 21 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని కాకతీయ హిల్స్ లో నియోజకవర్గ నాయకులతో కలిసి కొత్తగా ఏర్పాటు చేసిన క్లినిక్ కె ఫేషియల్ ఎస్తెటిక్స్, కాస్మెటిక్ సెంటర్ ను మాదాపూర్ డివిజన్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ డీవీ ప్రదీప్ కుమార్ రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి జగదీశ్వర్ గౌడ్ ముఖ్యతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ గౌస్, రవీందర్ రెడ్డి, యలమంచి ఉదయ్ కిరణ్, కాలనీ అధ్యక్షుడు లక్ష్మణ్, వివేక్ గౌడ్, ప్రేమ్ యాదవ్, జగన్, రామస్వామి, సురేష్, సర్దార్, నరేష్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.







