- శేరిలింగంపల్లి ప్రభుత్వ పాఠశాలలో సైబరాబాద్ జాగృతి కళాబృందం ప్రదర్శన
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో సైబరాబాద్ పోలీస్ జాగృతి కళాబృందం ఆధ్వర్యంలో పలు అంశాలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చట్టాల తీరు, షీ టీమ్స్, గృహ హింస, యాంటీ ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, కమ్యూనిటీ సీసీటీవీల ఏర్పాటు, సోషల్ మీడియా వల్ల కలిగే దుష్ప్రభావాలు, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలు, సైబర్ క్రైమ్స్, ఆన్లైన్ ఫ్రాడ్, బాల్య వివాహాలు, మొబైల్ ఫోన్ల వాడకం, రోడ్డు ప్రమాదాలు, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, హెల్మెట్లను ధరించడం, మానవ అక్రమ రవాణా.. తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్, చందానగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో, ఎస్ఐ రాములు, మియాపూర్ షీ టీమ్స్ ఇన్చార్జ్, ఏఎస్ఐ కిషన్, కళాబృందం ఇన్చార్జీ ఏఆర్ఎస్ఐ నాగరాజు, షీ టీమ్,స్మైల్ టీమ్ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోధన సిబ్బంది, విద్యార్థులు పెద్ధసంఖ్యలో పాల్గొన్నారు.
