నమస్తే శేరిలింగంపల్లి: రంగారెడ్డి, హైదరబాద్, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం శేరిలింగంపల్లి అసెంబ్లీ ఆద్వర్యంలో ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. చందానగర్ క్రీస్టల్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో ఉదయం 10..00 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందని ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ అభ్యర్థి, ఎమ్మెల్సీ రామ్ చందర్ రావు, బిజెపి రాష్ట్ర నాయకులు పేరాలా శేఖర్ రావు, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు సామారంగారెడ్డి పాల్గొని మార్గదర్శనం చేస్తారని తెలిపారు. నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బుచ్చిరెడ్డి పిలుపునిచ్చారు.