బేగంపేటలో తప్పిపోయిన‌ బాలుడు చందానగర్ లో లభ్యం

నమస్తే శేరిలింగంపల్లి: బేగంపేటలో‌ తప్పిపోయిన ఆరేళ్ల బాలుడి ఆచూకీని చందానగర్ పోలీసులు కనిపెట్టారు. చందానగర్ ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరాల ‌ప్రకారం నేపాల్ కు చెందిన రాజేష్ బాయ్ సోనీ కుమారుడు నరేష్ సోనీస్ బేగంపేట రసూల్ పురా జైన్ మందిర్ వద్ద నివాసం ఉంటున్నారు.

తప్పిపోయి దొరికిన‌ ఆరేళ్ల బాలుడు నరేష్ సోనీస్

ఆరేళ్ల వయస్సు‌ గల నరేష్ సోనీస్ అనుమానాస్పద స్థితిలో‌ తప్పిపోయినట్లు బేగంపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బేగంపేటలో‌ తప్పిపోయిన బాలుడిని‌ చందానగర్ ‌పోలీసులు పట్టుకుని వివరాలు ‌అడిగి‌ తెలుసుకున్నారు. విచారణలో బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో‌ తప్పిపోయినట్లు తెలుసుకున్న చందానగర్ పోలీసులు ఆ బాలుడిని‌ బేగంపేట పీఎస్ కు అప్పగించినట్లు తెలిపారు.

చందానగర్ పోలీసులకు దొరికిన తప్పిపోయిన బాలుడు

.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here