పట్టణ ప్రగతిలో పరిసరాల పరిశుభ్రత -చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలలో చెత్తా చెదారం నిల్వ ఉంచకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ముగింపులో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ లో స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి పర్యటించారు. కాలనీ వాసులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మురుగు నీరు నిల్వ ఉండకుండా పారిశుధ్య పనులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, కాలనీ వాసులు గోపాల్ రెడ్డి, బాలాజీ , శ్రవణ్ , మధుసూదన్ రెడ్డి, నరసింహ, డానియల్, సునీల్, సందీప్, పవన్, రమేష్, నాగేశ్వర్, ప్రశాంత్, సురేష్, శ్రీకాంత్, పుల్లిపాటి నాగరాజు, ఓ వెంకటేష్, నరేందర్ భల్లా, అక్బర్ ఖాన్, దాస్, కొండల్ రెడ్డి, కార్తీక్ గౌడ్, దీక్షిత్ రెడ్డి, సందీప్ రెడ్డి, అవినాష్ రెడ్డి, మాధవి తదితరులు పాల్గొన్నారు.

సాయి నగర్ కాలనీ వాసులతో మాట్లాడుతున్న చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here