నాలాల విస్త‌ర‌ణ, లింకురోడ్ల అభివృద్ధిపై సీసీపీతో సమావేశ‌మైన ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో చీఫ్ సిటీ ప్లానర్(సీసీపీ) దేవేందర్ రెడ్డితో ప్ర‌భుత్వ విప్ గాంధీ శుక్ర‌వారం ప్రత్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నాల విస్తరణ పనులు, లింక్ రోడ్డుల అభివృద్ధిపై ప్ర‌ధానంగా చర్చించారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ రోడ్లు, నాలల విస్తరణ పనులకు ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, సాంకేతిక ప్ర‌క్రియ‌ను త్వరితగతిన జరిగేలా చూడాలని అన్నారు. ముఖ్యంగా చందానగర్ లోని గంగారాం గుడి నుండి అపర్ణ వరకు నిర్మించబోయే 100 ఫీట్ల రోడ్డును వెంటనే చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తోసుకురావలని కోరారు. నాలాల విస్తరణ పనుల పురోగతి పై, అసంపూర్తిగా మిగిలిపోయిన నాలాల త్వరగా పూర్తయ్యేలా చూడలని సీసీపీ దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకువ‌చ్చారు. ఐతే సీసీపీ దేవేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించార‌ని, వెంటనే పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చార‌ని గాంధీ తెలిపారు.

సీసీపీ దేవెంద‌ర్ రెడ్డితో మాట్లాడుతున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here