మానసిక ప్రశాంతత కోసం బ్రహ్మకుమారీస్ భవనం దోహదం – ఓం శాంతి బ్రహ్మకుమారీస్ భవన నిర్మాణానికి విప్ గాంధీ భూమి పూజ

నమస్తే శేరిలింగంపల్లి: మానసిక ప్రశాంతత కోసం ఓం శాంతి బ్రహ్మకుమారీస్ వారు నిర్మించనున్న భవనం ఎంతగానో తోడ్పడుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ‌ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ లో ఓం శాంతి బ్రహ్మ కుమారీస్ నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప సొసైటీ లో ఓం శాంతి బ్రహ్మ కుమారీస్ నిర్మించ తలపెట్టిన నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడం సంతోషకరమని అన్నారు. ఈ భవన నిర్మాణంతో ఇక్కడి ప్రజలకు యోగ, ఆధ్యాత్మిక ప్రార్థనలు, శాంతి ప్రవచనాలు చేసుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.

ఓం శాంతి బ్రహ్మకుమారీస్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

ఈ భవన నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, భవన నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభం చేసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , అయ్యప్ప సొసైటీ ప్రెసిడెంట్ పెద్ద మధుసూదన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చిన్న మధుసూదన్ రెడ్డి, వెంకటేశ్వర రావు, బ్రహ్మ కుమారిస్ హైదరాబాద్ ఇంచార్జీ బికె కుల్దీప్ దిది, రేఖ తదితరులు పాల్గొన్నారు.

భూమి పూజ కార్యక్రమం లో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here