బిజెవైఎం బైక్ ర్యాలీని విజయవంతం చేద్దాం

నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా యువ మోర్చా గచ్చిబౌలి డివిజన్ కార్యవర్గ సమావేశాన్ని గోపన్ పల్లి లో ని కార్పొరేటర్ కార్యాలయంలో బిజెవైఎం డివిజన్ అధ్యక్షుడు నక్కా శివ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం బీజేవైఎం ఆధ్వర్యంలో ఆగస్టు 5 వ తేదీన తలపెట్టనున్న మహా బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని బిజెపి,‌ బీజేవైఎం నాయకులు, కార్యకర్తలందరం కలిసికట్టుగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి , బిజెపి జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా బిజెవైఎం ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్, జిల్లా కార్యదర్శి కుమార్ సాగర్, బీజేవైఎం డివిజన్ మాజీ అధ్యక్షుడు శివ గౌడ్ , డివిజన్ జనరల్ సెక్రటరీ సామ్రాట్ గౌడ్ , ప్రవీణ్ యాదవ్, డివిజన్ఉ పాధ్యక్షుడు మున్నూర్ సాయి , శంకర్ గౌడ్, కోశాధికారి సాయి కిరణ్ గౌడ్, కార్యదర్శి అనంతుల అరుణ్, సంపత్, బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బిజెవైఎం‌ గచ్చిబౌలి డివిజన్ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here