శేరిలింగంపల్లి, మే 3 (నమస్తే శేరిలింగంపల్లి): రెజ్లింగ్ క్రీడాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ఫతేమైదాన్ క్లబ్ లో గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను అసోసియేషన్ నాయకులు అసోసియేషన్ ఛైర్మన్ గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగాసన్మానించారు. అనంతరం గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల్లో రెజ్లింగ్ క్రీడాకారుల కోటాను నిషేధించారని, దానిని పునరుద్ధరించాలని కోరారు. రెజ్లర్లు శరీరకంగా దృఢంగా ఉంటారని పోలీస్ ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. రెజ్లర్లు పోటీలలో పాల్గొనడం వల్ల చదువుల్లో వెనుకబడుతున్నారని అటెండెన్స్ లేని కారణంగా వారిని ఎగ్జామ్స్ రాయించడానికి కూడా అనుమతించడం లేదని తెలిపారు. వారికి అటెండెన్స్ లో మినహాయింపు ఇవ్వాలని, యువ రెజరర్లకు ఉన్నత చదువులు చదవడానికి తన వంతు సహకారం అందిస్తామని గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ గడ్డం శ్రీనివాస్ యాదవ్ చాలా మంచి నాయకత్వం లక్షణాలున్న వ్యక్తి అన్నారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్గా నియమితులైనందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి పోరాటపటిమ గల వ్యక్తిని ఎన్నుకున్నారని ఆయన రెజ్లింగ్ క్రీడాకారుల పట్ల అంకితభావంతో పనిచేసి వారికి తగిన విధంగా కృషి చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి సంతోష్ యాదవ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శైలేంద్ర సింగ్, వైస్ ప్రెసిడెంట్ కిరణ్ యాదవ్, వైస్ చైర్మన్ షేక్ సలాం బిన్ అబ్దుల్లా, జనరల్ సెక్రటరీ నజీర్ కుల్లాకి, ట్రెజరర్ ఖాలెద్ బామస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహ్మద్ అస్లాం, జాయింట్ సెక్రటరీ లింగం తదితరులు పాల్గొన్నారు.