శేరిలింగంపల్లి, డిసెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, రాజ నీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్రధారి, అంటరానితనంపై అలుపెరుగని పోరు చేసిన భారతరత్న డా. బి. ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి విగ్రహానికి హఫీజ్పేట్ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గోపాల్, సీతారాం, కేశవ్, అంబేద్కర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.






