దాడులు చేస్తే ప్రతిదాడులు తప్పవు – దళిత బంధు దగాబంధుగా మారింది – కాంగ్రెస్ నాయకులు చిరుమర్తి రాజు

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ నాయకులు ఇష్టారీతిగా కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తే ప్రతిదాడులు తప్పవని కాంగ్రెస్ నాయకుడు చిరుమర్తి రాజు హెచ్చరించారు. దళితబంధు పథకం దగా బంధుగా మారిందని, ధనవంతులకు, టీఆర్ఎస్ కు చెందిన నాయకులకు మాత్రమే దళితబంధు ద్వారా వాహనాలను అందిస్తున్నారన్నారు.

ఇదే విషయా‌న్ని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ఫోస్టు చేసినందుకు తనపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని ఆరోపించారు. ధనవంతులకు దళిత బంధును అందిస్తూ అసలైన లబ్ధిదారులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దళితబంధు పథకం ద్వారా మంజూరైన వాహనాలను కొంతమంది ధనవంతులకు ఇచ్చారని, అందులోనూ టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే ఇచ్చారన్నారు. ఈ విషయంపై నిజ నిర్దారణకు సిద్ధమని, దమ్ముంటే చర్చకు రావాలని దాడి చేస్తే, ప్రతి దాడులు తప్పవని చిరుమర్తి రాజు హెచ్చరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here