కూకట్పల్లి (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్ పల్లి, కొండాపూర్ డివిజన్ల ఆఫీసుల ఆవరణలో ఆర్టిజన్ విద్యుత్ కార్మికుల హక్కుల సాధనకు గాను తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 327, CVW B -2871 యూనియన్ ల మద్దతుతో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా గురువారం దీక్షలో ఎం. రామకృష్ణ, ఎ. వినోద్, సయ్యద్ ఖాదర్ అలీ, ఎం. శ్రావణ్, కె. ఆనంద్, బి. మోహన్, ఎస్. ఆదిమూర్తిలు కూర్చున్నారు.
