పేద మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసిన ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, మే 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్‌కు చెందిన సీనియర్ నాయకుడు మిరియాల ప్రీతమ్ ఆధ్వర్యంలోPAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ నివాసంలో ముగ్గురు పేద మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ పేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కుట్టుమిషన్లను అందజేయడం అభినందనీయమైన కార్యక్రమమని అన్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు అండగా నిలవడం గొప్ప విషయమని, మిరియాల ప్రీతమ్ చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని ప్రశంసించారు. పంపిణీ చేసిన కుట్టుమిషన్లను సద్వినియోగం చేసుకుని కుటుంబ పోషణకు ఉపయోగించుకోవాలని మహిళలకు సూచించారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు, కుటుంబాలకు ఆసరాగా మారేందుకు ఇటువంటి ఉపాధి సాధనాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారి సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

మహిళ‌లకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, వారికి ఎదురయ్యే ఏ సమస్యనైనా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని ఆరెకపూడి గాంధీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మిరియాల రాఘవరావు, మిరియాల ప్రీతమ్, నాయినేని చంద్రకాంత్ రావు, రజిని, కుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here