చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్లోని పాపిరెడ్డి కాలనీ సబ్స్టేషన్ 11కేవీ ఎపిటోమ్ గ్లోబల్ ఫీడర్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కరెంటు తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్న నేపథ్యంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తెల్లాపూర్ రోడ్డు, సాధన స్కూల్ వెనుక వైపు, ఎపిటోమ్ గ్లోబల్ స్కూల్ వెనుక వైపు, ఎపిటోమ్ గ్లోబల్ స్కూల్, రాక్ పార్క్ వైపు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నల్లగండ్ల సబ్స్టేషన్ మార్కెట్ ఫీడర్ పరిధిలో పాపిరెడ్డి సబ్స్టేషన్ ఎదురుగా, చందానగర్ రైల్వే స్టేషన్ ఎదురుగా కరెంటు ఉండదని తెలిపారు.