మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్లోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో శ్రీ విజయ దుర్గా దేవి వార్షిక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 108 ఔషధాలతో ఆయర్వేద పితామహుడు ధన్వంతరికి అభిషేకం చేపట్టారు. అనంతరం పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా కోటి వత్తులతో దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఖాదర్ వలీ, రవి వర్మ, బి.లక్ష్మీ, పెద్ది రమాదేవి, సుచితలను విజయ దుర్గా దేవి సన్నిధిలో భారతీయం సత్యవాణి, అట్లూరి సుబ్బారావులు ఘనంగా సన్మానించారు.








