ఓబీసీల పోరుబాట పుస్తకావిష్కరణలో ఓబీసీలందరూ పాల్గొనాలి: బేరి రామచందర్ యాదవ్

శేరిలింగంపల్లి, జూన్ 12 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఓబీసీల పోరుబాట నూతన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఓబీసీలందరూ పాల్గొనాలని బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ పుస్తకం ఓబీసీ హక్కులు, సామాజిక న్యాయం, రాజ్యాంగ హామీలు, సామాజిక చైతన్యంపై వెలుగులీనించే ప్రయత్నంగా రూపొందించబడింద‌న్నారు. దేశంలో సాంఘిక సమానత్వాన్ని సాధించడానికి ఓబీసీ వర్గం ఎదుర్కొంటున్న సవాళ్ళు, పోరాటాలు, విజయాలను వివరించే మౌలిక డాక్యుమెంట్ ఇద‌ని తెలిపారు. న్యాయ‌వాది పృథ్వీరాజ్ సింగ్ పరమార్, ఐఏఎస్ పరికిపండ్ల నరహరి ర‌చించిన ఈ పుస్త‌కాన్ని జూన్ 14వ తేదీన ఉద‌యం 10.30 గంట‌ల‌కు సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఆవిష్క‌రించ‌నున్నామ‌ని, అంద‌రూ హాజ‌రై విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here