బీసీలంద‌రూ ఏకం కావాలి: భేరి రామ‌చంద‌ర్ యాద‌వ్

మియాపూర్, సెప్టెంబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జై బిసి జాతీయ అధ్యక్షుడు కస్తూరి గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆర్కే సాయన్న ముదిరాజ్ పిలుపు మేరకు బీసీలు, ఎస్సీ ఎస్టీలకు అనుబంధంగా ఉన్న పార్టీల సమావేశాన్ని బీసీ సాధికారిక బీసీ భవన్‌లో నిర్వ‌హించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌న్నారు. అన్ని కులాల వారు ఏక‌మైన ఒక్క‌తాటిపై న‌డ‌వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అప్పుడే రాజ్యాధికారం చేజిక్కించుకోవ‌చ్చ‌న్నారు. ఇత‌ర పార్టీల‌కు ఊడిగం చేయ‌డం ఇక‌నైనా మానుకోవాల‌ని, బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను సాధించాల‌ని అన్నారు. ఈ కార్య‌క్రమంలో లాలూ నాయక్, సూర్యప్రకాష్, శేషగిరిరావు, వెంకటస్వామి, మాజీ ఎంఆర్ఓ మోహన్ రావు, మహేశ్వర రావు, జడ్చర్ల గోపి, బోయ సుశీల్ యాదవ్ పాల్గొన్నారు.

స‌మావేశం నిర్వ‌హిస్తున్న నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here