ఆదర్శ్ నగర్ లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శనివారం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రైనేజీ లైన్లను పరిశీలించారు. రోడ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఏఈ సునీల్ కు సూచించారు. రోడ్లు, వాటర్ లైన్లను, డ్రైనేజీ లైన్లు వేసేలా చూడాలని కాలనీవాసులు కోరగా అతి త్వరలో మిగతా పనులు కూడా పూర్తి చేస్తామని హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సోమదాసు, ఏఈ సునీల్, వర్క్ ఇన్ స్పెక్టర్ యాదగిరి, లక్ష్మీ నాయుడు, బాలన్న, సుధాకర్ రెడ్డి, ప్రసాద్, దశరథ, భీం రావు, బాబు, సత్యనారాయణ, జివి రావు, బాపిరాజు, మోహన్ రావు,శ్రీనివాస్, శ్రీనివాసరావు, మల్లయ్య, గోపాల్ యాదవ్, శ్రీకాంత్, శ్రీకాంత్ యాదవ్, పట్లోళ్ల నర్సింహారెడ్డి, గణపురం రవీందర్, బృంగీ సుమన్, రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శ్ నగర్ లో పాదయాత్ర చేస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here