బిజెపి రంగారెడ్డి(అర్భన్) జిల్లా కార్యదర్శిగా వరలక్ష్మి ధీరజ్

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రంగారెడ్డి(అర్భన్) ‌జిల్లా  కా కార్యదర్శిగా శేరిలింగంపల్లికి చెందిన వరలక్ష్మి ధీరజ్ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు యం.రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిలు వరలక్ష్మికి శనివారం నియామక పత్రాన్ని అందజేశారు. దీంతోపాటు శేరిలింగంపల్లి మహిళా మోర్చా కన్వీనర్ గా నియమితులైన పద్మ , శేరిలింగంపల్లి ప్రొఫెషనల్ సెల్ కన్వీనర్ గా సాయి కిరణ్ లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో డివిజన్ స్థాయి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు బాధ్యతలు పొందిన నాయకులు నియోజకవర్గంలోని నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకొని పార్టీ బలోపేతానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కృష్ణవేణి, మాదాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, శ్రీనివాస్, వరలక్ష్మి, ఇందిర తదితరులు పాల్గొన్నారు.

నియామకపు పత్రాలు అందజేస్తున్న బిజెపి‌ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు ‌సామ‌ రంగారెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here