ఏబీవీపీ రాష్ట్ర కార్యనిర్వాహణ‌ క‌మిటీ స‌భ్యుడిగా సంజ‌న్న‌గారి విజ‌య్‌కుమార్ రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ఏబీవీపీ రాష్ట్ర కార్యనిర్వాహణ‌ క‌మిటీ స‌భ్యుడిగా శేరిలింగంప‌ల్లికి చెందిన ఏబివీపి కుక‌ట్‌ప‌ల్లి విభాగ్ క‌న్వీన‌ర్ సం‌జన్న‌గారి విజ‌య్‌కుమార్ రెడ్డి నియ‌మితుల‌య్యారు. కామారెడ్డిలో ఇటీవ‌ల జ‌రిగిన ఏబీవీపీ 39వ రాష్ట్ర మహ‌స‌భ‌ల‌లో రాష్ట్ర నూత‌న క‌మిటీని ఎంపిక చేశారు. ఈ స‌బ‌లో రాష్ట్ర ఆర్థిక స్థితిగ‌తుల‌పై తీర్మాణాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ‌ ఈ సంద‌ర్భంగా విజ‌య్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ త‌న‌పై న‌మ్మ‌క‌ముంచి భాధ్య‌త‌లు అప్ప‌గించిన ఏబీవీపీ రాష్ట్ర, జాతీయ క‌మిటీ స‌భ్యుల‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రాష్ట్రంలో ఏబీవీపీ విస్త‌ర‌ణ‌తో పాటు, విద్యార్థుల స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తాన‌ని అన్నారు. అదేవిధంగా కుక‌ట్‌ప‌ల్లి విభాగ్‌కు చెందిన బాబు యాద‌వ్‌ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.

సంజ‌న్న‌గారి విజ‌య్‌కుమార్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here