కడుపునొప్పి బాధ భరించలేక యువకుడు ఆత్మహత్య

నమస్తే శేరిలింగంపల్లి: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కందుకూరి అరుణ్ (22) ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తూ మదీనగూడలోని దుర్గా కౌంటీ లో తన అక్క బావ తో కలిసి ఉంటున్నాడు. కొంత కాలంగా అరుణ్ కడుపునొప్పితో బాధపడుతున్నాడు. కడుపు నొప్పి తీవ్రతను భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు టవల్ తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. బావ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు.

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న అరుణ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here