హిందూ జాగృతి ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు ఘన నివాళి

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 28 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కాశ్మీర్ పహాల్గాం లోని ఉగ్రవాదుల దాడిలో అమరులైన పర్యాటకులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ.. హిందూ జాగృతి శేరిలింగంపల్లి ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు ఘన నివాళులు అర్పించారు. గోపినగర్ హనుమాన్ దేవాలయం నుండి.. చందానగర్ శ్రీదేవి థియేటర్ వద్ద నుండి.. పీజేఆర్ స్టేడియం నుండి వేరువేరుగా ప్రారంభమైన మూడు శాంతి ర్యాలీలు బిహెచ్ఇఎల్ చౌరస్తా వరకు చేరుకున్నాయి. పెద్ద సంఖ్యలో పాల్గొన్న హిందువులు అక్కడ కొవ్వొత్తులు వెలిగించి 2 నిమిషాలు మౌనం పాటించి పహల్గాం మృతులకు నివాళులు అర్పించారు. ఈ ర్యాలీలో సంఘ్ పరివార్ కార్యకర్తలు, వివిధ పార్టీల నేతలు, పతంజలి యోగ సమితి సభ్యులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని ఉగ్రవాదుల దుశ్చర్యపై మండిపడ్డారు.

పాకిస్తాన్ ద్వంద్వ నీతి పై ద్వజమెత్తారు. హిందువా కాదా అని తెలుసుకొని మరీ కాల్చి చంపడం అమానుషమని అన్నారు. హిందూ దేశంలో హిందువులకే రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న పశ్చిమ బెంగాల్‌లో హిందువులను తమ స్వస్థలాల నుండి తరిమి కొట్టారని.. ఈరోజు కాశ్మీర్ లోని పహాల్గంలో ఏకంగా పేర్లు అడిగి, కల్మా చదివించి, దుస్తులు విప్పదీసి మరి హిందువులపై దాడి చేయడాన్ని ప్రపంచం మొత్తం చూసిందని వాపోయారు. సమాజంలోని ప్రతి వర్గం వారు ఈ దుశ్చర్యను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పాకిస్తాన్ కు తగిన గుణపాఠం నేర్పించాలని మళ్లీ భారత్ వైపు కన్నెత్తి చూడకుండా వెన్నులో వణుకు పుట్టించాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here