న్యూ కాలనీలో పర్యటించిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: కాలనీల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ లో పలు సమస్యలు, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై స్థానిక‌ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు. కాలనీలో‌ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూకాలనీలో మౌళిక వసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో  ప్రవీణ్ రెడ్డి, ప్రవీణ్, గాలి రెడ్డి, వెంకటేష్, లావణ్య, బిఎస్ఎన్ సాయి, ఉమ, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here