నాలా విస్తరణ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: నాలా విస్తరణ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ కాలనీలో నాలా విస్తరణ లో భాగంగా రూ. 1.55 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో చేపడుతున్న, సీబీఆర్ ఎస్టేట్స్ వద్ద జరుగుతున్న నాలా విస్తరణ పనులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా అవసరాల దృష్ట్యా నాలా నిర్మాణ పనులపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి , మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు హరీష్, దీప్తి శ్రీ నగర్ కాలనీ వాసులు సీతారామయ్య, చంద్రశేఖర్ రావు, వెంకట్ , నెహ్రు, మంగపతి, రామారావు, మహేష్, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

నాలా విస్తరణ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here