ఉద్యోగాల ప్రకటన పట్ల వాలా హరీష్ హర్షం – కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

నమస్తే శేరిలింగంపల్లి: అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర వ్యాప్తంగా 91 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయడం గర్వంగా ఉందని హఫీజ్ పేట్ డివిజన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్ రావు అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మదీన గూడ రామకృష్ణ నగర్ లోని గాయత్రి అపార్ట్‌మెంట్ సర్కిల్ వద్ద వాలా హరీష్ రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ నిరుద్యోగ యువతకు శాశ్వత ప్రాతిపదికన 95 శాతం స్థానికతను గుర్తిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు అసెంబ్లీలో తీర్మానం చేయడం సంతోషకరమని అన్నారు. స్థానికత ఆధారంగా 91,142 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లు ఈ రోజు నుంచే అమలయ్యేలా అధికారులను ఆదేశించడం శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ నగర్ అసోసియేషన్ సభ్యులు ఉమామహేశ్వరరావు, విష్ణు, రసూల్ సాహెబ్, సుబ్బు, సుబ్రహ్మణ్యం, నాగేశ్వరరావు, గంగాధర్, సురేష్, వెంకటేశ్వరరావు, పూర్ణచందర్ రావు ఆయా కాలనీవాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం‌ చేస్తున్న వాలా హరీష్ రావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here