కేంద్ర రైల్వే మంత్రికి స్వాగతం పలికిన బిజెపి నాయకులు

నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ హైదరాబాద్ కు విచ్చేసిన సందర్భంగా శంషాబాద్ లోనీ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా ‌కలిశారు. మంత్రి అశ్విని వైష్ణవ్ కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా దేశీయ పరిజ్ఞానంతో కనుగొన్న కవాచి టెక్నాలజీ ప్రదర్శన, మేధ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ కర్చర్ల ఎల్లేష్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు శ్రీనివాస్, శివ సింగ్, హరీష్ శంకర్ యాదవ్, నరేష్, నాయకులు , కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు స్వాగతం పలుకుతున్న బిజెపి నాయకులు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here