నమస్తే శేరిలింగంపల్లి: అభివృద్ధి పనుల విషయంలో రాజీపడేది లేదని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ లో శుక్రవారం స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పర్యటించారు. నూతనంగా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదాపూర్ డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామన్నారు. ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌలికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సహదేవ్, గోపాల్ నాయక్, యాదన్న యాదవ్, గోపాల్, జైపాల్, సుబ్రమణ్యం, వర్క్ ఇన్ స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.