శివాలయాల్లో పూజలు చేసిన జ్ఞానేంద్ర ప్రసాద్

నమస్తే శేరిలింగంపల్లి: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎంఏ నగర్ శివాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు మహాశివరాత్రి రోజున ఉపవాస, జాగరణ దీక్షలు చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారిని స్మరించుకోవడం జరిగిందని అన్నారు. ఆలయంలో శివలింగానికి జ్ఞానేంద్రప్రాద్ పూజ, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లోని శివాలయాలను సందర్శించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్రీధర్ రావు, కోటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు రవి, విజయ్, నరేంద్ర, రాజు, సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఎంఏ నగర్ లోని శివాలయంలో పూజలు చేస్తున్న జ్ఞానేంద్ర ప్రసాద్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here