టేకు నర్సింహా నగర్ లో యూజీడీ లైన్లు వేయాలి – ఎంసీపీఐయూ డివిజన్ కార్యదర్శి శ్రీనివాస్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని టేకు‌ నర్సింహా నగర్ లో నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులై‌న్లు వేయాలని ఎంసీపీఐయూ మియాపూర్ డివిజన్ కార్యదర్శి కన్నా శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హెచ్ ఎం డబ్ల్యు ఎస్ డీజీఎం నాగప్రియకు వినతి పత్రం అందజేశారు. కన్నా శ్రీనివాస్ మాట్లాడుతూ టేకు నర్సింహా నగర్ లో గతంలో వేసిన 8 ఇంచుల డ్రైనేజీ పైపులై‌న్లు మట్టిలో కుంగిపోవడంతో మ్యా‌న్ హోల్స్ నుంచి డ్రైనేజీ రోడ్లపైపొంగిపొర్లుతుందన్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 150 మీటర్ల తో నూతనంగా యూజీడీ పైపులైన్ వేసి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో టేకు నర్సింహా నగర్ కార్యదర్శి శంకర్ పాల్గొన్నారు.

యూజీడీ సమస్య పరిష్కరించాలని వినతి పత్రం అందజేస్తున్న ఎంసీపీఐయూ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here