ఆకట్టుకున్న కళాకారుల నృత్యప్రదర్శనలు

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కళాకారుల కూచిపూడి, భరతనాట్యం నృత్య ప్రదర్శన పలువురిని ఎంతగానో ఆకట్టుకుంది. మయూర సంగీత నృత విద్యాలయం త్రిసూర్ కేరళ గురువులు విజేష్ వల్లత్ శిష్య బృందం చేసిన కూచిపూడి, భరతనాట్యం నృత్య ప్రదర్శన ఎంతగానో అలరింపజేశాయి. గోపాలక పాహిమాం, వర్ణం, అష్టపది, తిల్లాన, మంగళం తదితర అంశాలను కళాకారులు విజేష్ వల్లత్, రేష్మ విజేష్, శ్రీదేవి, వినిజ, అక్షర, కృష్ణ ప్రియ, ఆర్య, తదితర కళాకారులు ప్రదర్శించి మెప్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here