అసంపూర్తిగా ఉన్న నాలా విస్తరణ పనులను పూర్తి చేయండి – ప్రభుత్వ విప్‌ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: నాలా విస్తరణ పనులను వేగవంతం చేయాలని, అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సంబంధిత అధికారులకు సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ నాల విస్తరణ లో భాగంగా అసంపూర్తిగా మిగిలిన నాలా విస్తరణ పనులను జోనల్ కమిషనర్ ప్రియాంక ఆల, జీహెచ్ఎంసీ అధికారులు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి సోమవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాబోయే వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని అన్నారు. అసంపూర్తిగా మిగిలిన నాలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతిని, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు‌.

నాలా విస్తరణ పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ,‌ జడ్సీ ప్రియాంక
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here