ప్రభుత్వ స్థలాలను కాపాడాలని కలెక్టరేట్ లో ఏకాంత్ గౌడ్ ఫిర్యాదు

నమస్తే శేరిలింగంపల్లి: కూకట్‌పల్లి మండల పరిధిలోని శంశీగూడ లో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని బిజెపి నాయకులు ఏకాంత్ గౌడ్ జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగుల నరసింహా రెడ్డి కి ఏకాంత్ గౌడ్ వినతి పత్రం అందజేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్ పల్లి మండల పరిధిలో శంశీగూడ గ్రామ ప్రభుత్వ సర్వే నంబర్ 57ను అదే గ్రామ సర్వే నంబర్ 29 అని తప్పుడు పత్రాలను సృష్టించి రూ. 30 కోట్ల విలువైన 2500 గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన అక్రమార్కులపై విచారణ చేపట్టాలని కోరారు. గతంలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలమని కూల్చివేసిన స్థలంలోనే ఏడాది కాలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాలని, అక్రమార్కులకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారుల చర్యలను బట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఏకాంత్ గౌడ్ తెలిపారు.

శంశీగూడలో ప్రభుత్వ స్థలాలను కాపాడాలని అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తున్న ఏకాంత్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here