నమస్తే శేరిలింగంపల్లి: అనునిత్యం పేద, బడుగు బలహీనవర్గాల ప్రజల కోసం పోరాటం చేసిన పేదల పెన్నిధి ఎంసీపీఐయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు తాండ్ర కుమార్ అకాల మరణం బాధాకరమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ లో తాండ్ర కుమార్ పార్థీవ దేహాన్ని స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే గాంధీ సందర్శించి పూలమాలలతో ఘన నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తాండ్ర కుమార్ అనునిత్యం పేద ప్రజల కోసం చివరి శ్వాస వరకు పోరాడి ప్రజల పక్షాన నిలబడిన మహనీయుడు అన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం శ్రమించారని, కుమార్ అకాల మరణం తీవ్ర దిగ్భాంతికరమని తెలిపారు.

.