రాయదుర్గం పోలీసుల ఆకస్మిక తనిఖీలు

నమస్తే శేరిలింగంపల్లి: మాదక‌ ద్రవ్యాల రవాణాను, స్నాచింగ్ లను అరికట్టేందుకు రాయదుర్గం పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా శుక్రవారం దర్గా ఎక్స్ రోడ్డు వద్ద ఇన్ స్పెక్టర్ తిరుపతి పర్యవేక్షణలో రాయదుర్గం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. స్నాచింగ్ లను అరికట్టడంతో పాటు గంజాయి, డ్రగ్స్ రవాణాను నివారించేందుకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మికంగా వాహనాల తనిఖీ చేపట్టడం జరుగుతుందని వాహనదారులు సహకరించాలని కోరారు.

ఆకస్మికంగా వాహనాలను తనిఖీ చేస్తున్న రాయదుర్గం పోలీసులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here