నేతాజీ నగర్ క్రిస్మస్ వేడుకల్లో భేరి రాంచందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో చెరుకుల శ్రీకాంత్ నివాసంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. కాలనీ అధ్యక్షుడు భేరీ రామచందర్ యాదవ్ పాల్గొని క్రిస్టియన్ సోదరీసోదరులకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాంచందర్ యాదవ్ మాట్లాడుతూ ఏసుప్రభు ఈ లోకంలో అవతరించి ప్రపంచ మానవాళికి మంచి సందేశమిచ్చారన్నారు. ప్రేమానురాగాలతో జీవించాలని, శాంతి మార్గాన్ని చూపించారని చెప్పారు. దేశ ప్రజలందరూ సోదర భావంతో మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాయుడు, యువజన విభాగం అధ్యక్షులు కె. రాము యాదవ్, సాయి కుమార్ గౌడ్, వాసు, ఎండి సలీం, శ్యామ్ కుమార్, పైల్వాన్ సాయి తేజ, గిరిబాబు, చంద్ర శేఖర్ యాదవ్, అశోక్, లవణ చారి, సురేష్, గోవింద్, రాజేష్, కాలనీ పెద్దలు, యువజన నాయకులు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న భేరి రాంచందర్ యాదవ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here